గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 14 మే 2020 (21:08 IST)

ప్రకాశం జిల్లా ట్రాక్టర్ ప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన గవర్నర్

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో జరిగిన ట్రాక్టరు ప్రమాదంలో 9 మంది కూలీలు దుర్మరణం పాలైన సంఘటనపై ఆంధ్రపద్రేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. విద్యుత్ స్తంభానికి ట్రాక్టర్ ఢీకొన్న నేపధ్యంలో ఈ ప్రమాదం చోటుచేసుకోగా, ఏడుగురు మహిళలు మృతి చెందారు.
 
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వభూషణ్ హరిచందన్ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేసారు. మృతి చెందిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాల పాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు ప్రభుత్వపరంగా అన్ని రకాల సహాయ సహకారాలు వేగంగా అందాలని కోరారు.