1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 26 జనవరి 2022 (12:50 IST)

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

విజయవాడలోని ఇందిరా ప్రియదర్విని స్టేడియంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, శాసన సభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌ రాజు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు రిపబ్లిక్‌ డే వేడుకల్లో పాల్గొన్నారు. కోవిడ్‌ నేపథ్యంలో విజటర్స్‌కు అనుమతి నిరాకరించారు. 

 
మ‌రోవైపు అమరావతి అసెంబ్లీ భవనంపై రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కె.మోషేన్ రాజు  జాతీయ జెండాను ఎగుర‌వేశారు. అసెంబ్లీ భవనం వద్ద రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం జాతీయ జెండాను ఎగురవేశారు. అదే విధంగా అమరావతి సచివాలయం మొదటి బ్లాకు వద్ద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీరచ శర్మ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు.