1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (14:50 IST)

మాజీ సీఈసీ మృతిపట్ల గవర్నర్ బండారు సంతాపం

కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ గాలి వెంకట గోపాల కృష్ణమూర్తి మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపాన్ని వ్యక్తం చేశారు. జీవీజీ కృష్ణమూర్తి మృతి తనను బాధను కలిగించిందన్నారు. న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఎన్నో కీలక కేసులను వారు వాదించారని తెలిపారు. గతంలో వారు భారతీయ న్యాయ సంఘంలో మెంబర్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారని, కేంద్ర ఎన్నికల సంఘం కమిషనరుగా కూడా పనిచేశారని వారి సేవలను దత్తాత్రేయ గుర్తుచేసుకున్నారు. 

1992లో తానూ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు గాలి వెంకట గోపాల కృష్ణమూర్తితో తనకు వారితో అనుబంధం ఏర్పడిందని, తాను  కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించినప్పుడు తనకు కృష్ణమూర్తి అనేకమైన సలహాలు సూచనలు అందించేవారని, మృదుస్వభావి, స్నేహశీలి అయిన కృష్ణమూర్తి సేవలు ఎనలేనివని బండారు దత్తాత్రేయ కొనియాడారు. ఆ మహానుభావుడి మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు బండారు దత్తాత్రేయ తెలియజేశారు.