కిరణ్ రాయల్ బాధితురాలు కిలేడీనా?.. చెన్నై మీదుగా జైపూర్కు తరలింపు...
జనసేన పార్టీ తిరుపతి ఇన్చార్జ్ కిరణ్ రాయల్పై తీవ్రమైన ఆరోపణలు చేసిన లక్ష్మి అనే మహిళపై పలు మోసం కేసులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా, క్రిప్టో కరెన్సీ వ్యవహారంలో గత 2021లో లక్ష్మిపై కేసు నమోదైవుంది. అప్పటి నుంచి ఆమె పరారీలో ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా కిరణ్ రాయల్పై లైంగిక, మోసం ఆరోపణలు చేసిన లక్ష్మిరెడ్డి చేశారు. ఈ వార్త సంచలనం కావడంతో పాటు విలేకరులతో ఆమె మాట్లాడుతున్న దృశ్యాలు టీవీల్లో వచ్చాయి. టీవీల్లో లక్ష్మిరెడ్డిని గుర్తించిన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ పోలీసులు.. సోమవారం తిరుపతికి వచ్చి ఆమెను అరెస్టు చేశారు.
ఆ తర్వాత ఆమెను చెన్నై మీదుగా జైపూర్కు తరలించారు. వైద్య పరీక్షల తర్వాత తిరుపతి మొదటి అదనపు సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. ట్రాన్సిస్ట్ అరెస్టు వారెంట్ ఉండటంతో లక్ష్మిరెడ్డిని జైపూర్ పోలీసులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. అయితే, తనకు ప్రాణహాని ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులను తోడుగా తీసుకెళ్లేందుకు కోర్టు అవకాశం కల్పించింది.
కాగా, క్రిప్టో కరెన్సా వ్యవహారంలో 2021లో జైపూర్, చంద్వాది పోలీస్ స్టేషన్లో లక్ష్మిరెడ్డిపై కేసు నమోదైవుంది. అప్పటి నుంచి ఆమె పరారీల ఉన్నారు. మీడియాలో లక్ష్మిరెడ్డిని గుర్తించి తిరుపతికి వచ్చిన జైపూర్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.