సంబంధిత వార్తలు
- కొల్లేరు చెరువులోకి బుడమేరు నీరు.. ముంపులో 18 గ్రామాలు
- బుడమేరుపై రిటైనింగ్వాల్ నిర్మించనున్నాం.. మంత్రి నారాయణ
- సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ... రూ.కోటి చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం
- విజయవంతంగా బుడమేరు గండ్లు పూడ్చివేత (Video)
- 'బుడమేరు' గండి పూడ్చివేత పనులు.. రేయింబవుళ్లు శ్రమిస్తున్న మంత్రి రామానాయుడు (Video)
తెలంగాణ హైడ్రా చట్టాన్ని ఏపీకి తీసుకొస్తాం.. చంద్రబాబు నాయుడు
Chandra babu
ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా 8వ రోజు విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. కుమ్మరిపాలెం జంక్షన్, సితార సర్కిల్, చిట్టానగర్, మిల్క్ ప్రాజెక్ట్ మీదుగా జక్కంపూడి వెళ్లారు. ఆయా ప్రాంతాల్లో వరద సహాయక కార్యక్రమాలపై బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలంగాణలో అమలులో ఉన్న ఆపరేషన్ హైడ్రా తరహాలో చట్టాన్ని తీసుకొచ్చి బుడమేరు అక్రమాలను తొలగిస్తామని హెచ్చరించారు. కొంతమంది ఆక్రమణల కారణంగా.. లక్షలాది మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
