గుడిమెట్లలో వజ్రాల వేట.. ఓ కుటుంబానికి నీలిరంగు వజ్రం
ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఓ కుటుంబానికి అదృష్టం తలుపుతట్టింది. గుడిమెట్లలో వజ్రాల వేట కోసం వెళ్లిన వారికి విలువైన నీలిరంగు వజ్రం దొరికింది. ఆ వజ్రం విలువ దాదాపు రూ.10 లక్షలు ఉంటుంది. దాని బరువు 4 క్యారెట్ల వరకు ఉంటుందని టాక్. ఎన్నో ఏళ్లుగా గుడిమెట్లలో వజ్రాల వేట కొనసాగుతుంది.
చిన్నచితక వజ్రాలు దొరికాయి. కానీ.. ఇంత విలువైన వజ్రం దొరకడం ఇదే తొలిసారి. గుడిమెట్ల రాజులకాలం నాటి రాజధాని. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన రాజుల కోట కూడా అక్కడ ఉన్నాయి. గతంలోనూ ఇక్కడ వజ్రాలు దోరకడంతో గుడిమెట్లకు వజ్రాల వేట కోసం వచ్చే ప్రజల తాకిడి పెరిగింది.