శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 22 నవంబరు 2020 (18:10 IST)

దుర్గ‌మ్మ హుండీ ఆదాయం రూ.1.77 కోట్లు

శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్దానం ఇంద్రకీలాద్రిపై మహామండపంలో హుండీల్లోని కానుక‌ల‌ను లెక్కించారు. గడచిన 21 రోజుల‌కుగాను 37 హుండీల్లో కానుక‌ల‌ను లెక్కించ‌గా రూ.1,77,66,026 న‌గ‌దు,   
415 గ్రాములు బంగారం, 6.100 కిలోగ్రాముల వెండి వ‌స్తువుల‌ను క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు భ‌క్తులు కానుక‌గా స‌మ‌ర్పించారు.

పాలక మండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో ఎం.వి.సురేష్‌బాబు, పాలకమండలి సభ్యులు ఎన్.అంబిక, దేవాదాయ‌ శాఖ  సిబ్బంది, ఎస్‌పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షించారు.