శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 5 జనవరి 2021 (11:36 IST)

స్నేహితుడే కదా అని ఇంటికి పిలిస్తే తన భార్యనే లొంగదీసుకున్నాడు, ఆ తర్వాత?

ప్రాణ స్నేహితుడు కామాంధుడవుతాడని గమనించలేకపోయాడతను. స్నేహితుడే కదా అని తరచూ తన ఇంటికి పిలవడం, పార్టీలు చేసుకోవడం చేస్తుండేవాడు. ఇలా తరచూ ఇంటికి వస్తున్న అతడి స్నేహితుడు తన ఫ్రెండ్ భార్యనే లొంగదీసుకున్నాడు. ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత స్నేహితుడు అడ్డుగా వున్నాడని అతడిని హత్య చేసాడు.
 
పూర్తి వివరాల్లోకి వెళితే... గుత్తి ఆర్.ఎస్ లోని తోళ్లషాపులో నివాసం వుంటున్న అశోక్ పెయింటర్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి యోగి అనే వ్యక్తి మంచి స్నేహితుడు. దాంతో తరచూ తన స్నేహితుడిని ఇంటికి పిలుస్తుండేవాడు. ఈ క్రమంలో యోగి తన స్నేహితుడు అశోక్ భార్యపై కన్నేసాడు. మెల్లగా ఆమెను లొంగదీసుకున్నాడు.
 
స్నేహితుడు అశోక్ ఇంట్లో లేనప్పుడు ఆమెతో గడిపేవాడు. భార్యతో స్నేహితుడు సన్నిహితంగా వుండటాన్ని చూసి షాక్ తిన్నాడు. ఆ తర్వాత భార్యను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. కానీ ఆమె మాత్రం భర్త అశోక్ కంటే యోగినే కావాలనుకుంది.
 
ఆ ప్రకారం భర్త హత్యకు పక్కా ప్రణాళిక వేసి ప్రియుడిని రంగంలోకి దింపింది. దాంతో అతడు స్నేహితుడు అశోక్ ను పార్టీ చేసుకుందాం రమ్మని పిలిచి పూటుగా మద్యం తాగించాడు. అనంతరం కత్తితో దారుణంగా పొడిచి హత్య చేసాడు. తన కుమారుడి హత్యపై అతడి తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి వాస్తవాన్ని వెలికి తీశారు.