శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 4 జనవరి 2021 (19:45 IST)

మరిదితో వివాహేతర సంబంధం, తప్పని చెప్పినా వినలేదు, అంతుచూసాడు

చెన్నై సిటీ మైలాపూర్ లోని లాల్ ఎస్టేట్ ప్రాంతంలో నివాసముండే పళణి, మరియమ్మాల్‌లకు సంవత్సరం క్రితమే వివాహమైంది. కానీ పిల్లలు లేరు. పళణి తమ్ముడు సెంథిల్ స్థానికంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. అయితే పళణి మాత్రం చదువుకోకపోవడంతో ఆటో నడుపుకుని జీవనం సాగిస్తున్నాడు.
 
ఉదయం ఇంటి నుంచి వెళితే రాత్రికి గానీ పళణి ఇంటికి రాడు. ఆటో నడిపి జీవనం సాగించాల్సిన పరిస్థితి. ఆటో  నడిపితే గానీ ఇళ్ళు గడవని పరిస్థితి. ఎప్పుడూ పనిలో బిజీగా ఉండే పళణి భార్యను మరిచిపోయాడు. బాగా అలసిపోయి ఇంటికి వచ్చి పడుకునేవాడు. ఆమెతో గడిపేవాడు కాదు.
 
దీంతో భార్యతో విసిగిపోయింది. పళణి తమ్ముడు సెంథిల్ తరచూ ఇంటికి వచ్చి వెళుతుండటంతో అతనిపై కన్నేసింది. మొదట్లో వదిన కదా అనుకుని దూరంగా ఉన్నాడు సెంథిల్. కానీ అతడిని మెల్లగా దగ్గరైంది. ఇలా వీరి బాగోతం కాస్త 10 నెలలకు పైగానే సాగింది.
 
ఇరుగుపొరుగు వారు సెంథిల్ తరచూ పళణి లేని సమయంలో ఇంటికి వచ్చి పోతుండటంతో మరియమ్మాల్‌ను మందలించారు. తప్పని చెప్పారు.ఇది కాస్త భర్తకు తెలిసింది.
 
మద్యానికి బానిసయ్యాడు. భార్యను, తమ్ముడిని మందలించాడు. అయితే వారు మారలేదు దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన పళణి తమ్ముడిని అతి దారుణంగా హత్య చేశాడు. నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయాడు.