1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 జూన్ 2022 (14:56 IST)

విశాఖలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.11 కోట్ల సామగ్రి స్వాహా.. ఏడుగురికి గాయాలు

fire accident
విశాఖలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షిప్పింగ్ గోదాములో ఏర్పడిన ఈ అగ్నిప్రమాదం ద్వారా తానా పంపిన రూ.11 కోట్ల కొవిడ్ సామగ్రి కాలి బూడిద అయ్యింది. ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. విశాఖ పెదగంట్యాడలోని శ్రావణి షిప్పింగ్ గోదాములో కరోనా మహమ్మారి సమయంలో తెలుగు ప్రజలకు పంపిణీ చేసేందుకు వీలుగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఈ సామగ్రిని సేకరించి పంపించింది.

ఇందులో శానిటైజర్లు, గ్లౌజులు, మాస్కులు, ఇతర సామగ్రి ఉన్నాయి. కెనడా నుంచి రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా గతేడాది డిసెంబరులో ఈ సామగ్రిని దిగుమతి చేసుకున్నారు. 
 
రాష్ట్రంలోని ఆరోగ్య కేంద్రాలకు గవర్నర్ చేతుల మీదుగా వీటిని పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండగానే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.