శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2022 (16:05 IST)

దేశీ మిర్చి ఆల్ టైం రికార్డు.. ఏకంగా రూ.90 వేలు

మిర్చి ధర ఆల్ టైం రికార్డును సృష్టించింది. వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్లో దేశీ మిర్చి ధర ఏకంగా రూ. 90 వేలు పలికింది. మార్కెట్ చరిత్రలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం.
 
వివరాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లా పరకాల మండలం హైబత్ పల్లికి చెందిన అశోక్ అనే రైతు.. తాను పండించిన మిర్చిన మార్కెట్‌కు తీసుకొచ్చాడు.  
 
ఈ మిర్చిని మాధవి ట్రేడర్స్కు విక్రయించగా...లక్ష్మీ సాయి ట్రేడర్స్‌ క్వింటాల్‌కు రూ.90 వేలు వెచ్చించి కోనుగోలు చేసింది. అశోక్‌ తీసుకొచ్చిన మిర్చిలో ఒక్క బస్తాకు మాత్రమే రూ. 90 వేలు పలికింది. 
 
మిగతా బస్తాలకు మాత్రం సాధారణ ధరలే చెల్లించారు. క్వింటాల్ మిర్చికి రూ.90వేలు పలకడంపై రైతు అశోక్ హర్షం వ్యక్తం చేస్తున్నాడు.