శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 డిశెంబరు 2019 (09:57 IST)

యాచకురాలికి మద్యం తాగించి గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులు

తెలంగాణ రాష్ట్రంలో ఓ యాచకురాలిపై అత్యాచారం జరిగింది. తమవంతు సాయం చేసి ఆదుకోవాల్సిన వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మల్కాజిగిరికి చెందిన చిన్నప్ప(50), నేనావత్‌ విజయ్‌ కుమార్‌(53) అనే ఇద్దరు వ్యక్తులు ఈ నెల 17వ తేదీ అర్థరాత్రి పూటుగా మద్యం సేవించారు. ఆ తర్వాత రోడ్డు పక్కన కూర్చున్న యాచకురాలితో మాటలు కలిపి తమ ఇంటికి తీసుకెళ్లి ఆమెకు కూడా మద్యం తాగించారు. 
 
దీంతో ఆమె మత్తులోకి జారుకుంది. ఇదే అదునుగా భావించిన ఆ ఇద్దరు కామాంధులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన బాధితురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు, పోలీసులకు ఫోన్‌ చేశారు. అప్పటికే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. వారిని శుక్రవారం మిర్జాలగూడలో పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.