1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 22 మే 2021 (19:04 IST)

కరోనా ఆయుర్వేద మందును ఆమోదిస్తే తిరుమల శ్రీవారి పాదాల చెంత నుంచి..: చెవిరెడ్డి

కరోనా మందు తయారీతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నంను టీటీడీ పాలకమండలి సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ ఆయుర్వేద నిపుణులతో కలిసి సందర్శించారు.
 
♦️ కరోనా మందు తయారీ విధానం.. వినియోగించిన సహజ వన మూలికలు.. మందు ఏ విధంగా పనిచేస్తుంది.. అనే అంశాలపై శాస్త్రీయ అధ్యయనం చేసేందుకు విచ్చేసిన టీటీడీ ఆయుర్వేద నిపుణులు.. 
 
♦️చెవిరెడ్డి నేతృత్వంలో నెల్లూరు విచ్చేసిన ఆయుర్వేద నిపుణుల బృందం ఆనందయ్య  నివాసం, కరోనా మందు తయారు చేసిన ప్రాంతాన్ని, వినియోగించిన సహజ వనమూలికలను పరిశీలించారు. శాంపిల్స్ ను సేకరించారు.
 
♦️అనంతరం చెవిరెడ్డి మీడియా తో మాట్లాడారు..
 
♦️కరోనా ఆయుర్వేద మందు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 
♦️ కరోనా నుంచి కాపాడుతుందన్న నమ్మకం కలిగిస్తున్న నేపథ్యంలో..
టీటీడీ పాలకమండలి సభ్యుని హోదాలో కృష్ణ పట్నంలో ఆనందయ్య ఆయుర్వేద మందు తయారీని పరిశీలించేందుకు వచ్చామన్నారు..
 
♦️ టీడీడీ ఆయుర్వేద విభాగంలో సీనియర్ ప్రొఫెసర్లు, సంబంధిత శాస్త్రవేత్తలు విచ్చేశారని అన్నారు.
 
♦️ టీటీడీ పరిధిలో అధునాతన ఆయుర్వేద ఫార్మా  ఉందన్నారు. 
 
♦️ఈ ఆయుర్వేద మందు నిజంగా ఆమోదయోగ్యమైతే భవిష్యత్తులో ప్రజలకు అందించేందుకు టీటీడీ ముందుంటుందని అన్నారు..
 
♦️ ఐసిఎంఆర్ అధ్యయనం నివేదిక సానుకూలంగా ఉంటే.. రాష్ట్ర ప్రజలకు శ్రీవారి పాదాల చెంత ఆయుర్వేద మందు పంపిణీకి ప్రయత్నం ప్రారంభిస్తామని వెల్లడించారు.
 
♦️ఐసిఎంఆర్ అధ్యయనం నివేదిక వచ్చే లోపు టీటీడీ ఆయుర్వేద నిపుణులు కూడా కరోనా మందు పనితీరును అధ్యయనం చేస్తారని వివరించారు.