1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 6 ఏప్రియల్ 2023 (07:23 IST)

సీఎం జగన్‌కు కాలు ఎందుకు బెణికిందో వెల్లడించిన నారా లోకేశ్!

nara lokesh
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్టుండి కాలు బెణకడానికిగల కారణాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపాకు తేరుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఓటమి నుంచి జగన్మోహన్ రెడ్డి తేరుకోలేక పోతున్నారని ఆయన ఆరోపించారు. పైగా, వైకాపా ఓటమిని కొంతమంది వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు హైదరాబాద్ నగరంలోని ఒక ఫార్మ్ హౌస్‌లో సెలెబ్రేట్ చేసుకున్నారట అది తెలుసుకుని హాల్‌లో ఉన్న టేబుల్‌ని తన్నితే కాలు నొప్పి పెరిగిందని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. 
 
తాను చేపట్టిన 61వ రోజున పూర్తి చేసుకుని చేరుకుంది. ఈ సందర్భంగా ఉరవకొండ నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర జరిగింది. ఇందులోభాగంగా కూడేరు బహిరంగ సభలో నారా లోకేశ్ మాట్లాడుతూ, "తాడేపల్లి ప్యాలెస్ సైకో పని అయిపోయింది. సైనిల్ పాలన రాబోతుంది. యువగళం పాదయాత్ర వైకాపాకు అంతిమ యాత్ర. యూత్‌ పవర్ ఏంటో జగన్‌కి చూపించాం. 
 
30 రోజుల పాదయాత్ర పూర్తి అయ్యేసరికి ఫ్యాన్ మాడి మసైపోవడం ఖాయం. సడన్‌గా కాలి నొప్పి రావడానికి కారణం ఏంటో తెలుసా అంటూ ప్రశ్నించారు. పార్టీ ఓటమిని కొంతమంది వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక సంబరంగా జరుపుకున్నారని, అది తెలుసుకున్న సైకో జగన్ రెడ్డి తన హాలులోని టేబుల్‌ని గట్టిగా తన్నడంతో ఆయనకు కాలు నొప్పి ఎక్కువైందని చెప్పుకొచ్చారు.