1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

వ్యాయామం చేస్తుండగా బెణికి కాలు.. సీఎం జగన్ ఒంటిమిట్ట పర్యటన రద్దు

jagan
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కాలు బెణికింది. ఆయన వ్యాయామం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో ఈ నెల 5వ తేదీన కర్నూలు జిల్లా ఒంటిమిట్టలో రాములవారి కళ్యాణోత్సవానికి ఆయన హాజరుకావడం లేదు. మంగళవారం ఇంట్లో వ్యాయామం చేస్తుండగా కాలు బెణికడంతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. వైద్యుల సూచన మేరకు ఆయన తన ప్రయాణం రద్దు చేసుకున్నారు.
 
నోప్పి ఎంతకీ తగ్గకపోగా, సాయంత్రానికి మరింత ఎక్కువైంది. దీంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో బుధవారం ఒంటిమిట్ట ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. సీఎం జగన్‌కు గతంలోనూ ఇలాగే కాలికి గాయమైన విషయం తెల్సిందే. 
 
కాగా, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 5వ తేదీన ఆయన ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయ దర్శనం కోసం వెళ్లాల్సివుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాల్సివుంది. ఇందుకోసం అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. అయితే, కాలు బెణకడంతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకోగా, ఆ మేరకు అధికారులు జిల్లా యంత్రాంగానికి సమాచారం చేరవేశారు.