బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 19 ఆగస్టు 2020 (19:29 IST)

ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల‌కు రూ.50 ల‌క్ష‌ల కోవిడ్ బీమా

ఏపీఎస్ ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆర్టీసీ కార్మికులకు కోవిడ్ బీమా వర్తింపజేయాలని నిర్ణ‌యించింది. ఆర్టీసీ కార్మికులకు 50 లక్షల చొప్పున కోవిడ్ బీమా వర్తింపజేస్తూ బుధ‌వారం ఆదేశాలు జారీ చేసింది.

కార్మిక పరిషత్ సహా కార్మికుల వినతిపై స్పందించి ఆర్టీసీ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇదే విష‌యంపై  కార్మిక పరిషత్ నేతలు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబునుని కలసి మంగ‌ళ‌వారం వినతి పత్రం అందించారు.

ఈ క్ర‌మంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీని ఆర్టీసీ కార్మికులకు వర్తింప జేస్తున్న‌ట్లు ఆదేశాల్లో పేర్కొంది. ఆర్టీసీలో కరోనాతో ఇప్పటి వరకు 36 మంది మరణించిన నేప‌థ్యంలో వారంద‌రికీ బీమా వర్తింపజేసేందుకు ఆర్టీసీ చర్యలు ప్రారంభించింది.

మృతుల వివరాలు సహా తగిన డాక్యుమెంట్స్‌ను ఈ నెల 28లోగా పంపాలని అన్ని జిల్లాల రీజ‌న‌ల్ మేనేజ‌ర్స్‌కు ఆర్టీసీ ఎండీ ఆదేశాలు జారీ చేశారు.