గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Modified: గురువారం, 27 డిశెంబరు 2018 (17:29 IST)

నందమూరి పౌరుషం అంటే జూ.ఎన్టీఆర్‌దే... ఆ పిచ్చివాడికి ఎమ్మెల్యే... బాలయ్యపై లక్ష్మీపార్వతి

స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి, వైసీపి నాయకురాలు లక్ష్మీపార్వతి జూనియర్ ఎన్టీఆర్‌ను ఒకవైపు పొగడుతూ మరోవైపు బాలయ్యపై సంచలన కామెంట్లు చేశారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే... ఆనాడు లక్ష్మీ పార్వతిని బూచిగా చూపించి పార్టీని చంద్రబాబు నాయుడు ఆక్రమించేశారు. నందమూరి హరికృష్ణకు ఎమ్మెల్యే కాక ముందు మంత్రి పదవి ఇచ్చారు. ఆ తర్వాత కరివేపాకులా తీసిపడేశారు. 
 
ఆ వ్యవహారంపై హరికృష్ణ ఎంతో బాధపడ్డారు. మహానాడులో ఎన్టీఆర్ కొడుకుల ఫోటోలు లేవు. అన్నీ నారావారి ఫోటోలే. అది చూసి హరికృష్ణ స్టేజి పైనుంచి దిగి వచ్చేశారు. ఇలా ప్రతిసారి ఎన్టీఆర్ కుటుంబాన్ని కరివేపాకులా తీసేస్తూ వచ్చిన బాబు మొన్న తెలంగాణ ఎన్నికల్లో ఎన్టీఆర్ మనవరాలు సుహాసిని అమాయకురాలిని చేసి తీసుకొచ్చాడు. ఆమె ఓడిపోతుందని తెలిసినా బలిపశువు చేశారు.
 
బాలయ్య కూతురుని కొడుక్కు చేసుకుని అతడిని కట్టిపడేశావు. ఆ పిచ్చివాడికి ఏదో ఎమ్మెల్యే కట్టబెట్టావు. ఆయన ఎమ్మెల్యే ఒకవైపు సినిమాలు చేసుకుంటూ ఇంకోవైపు చేసుకుంటూ గెంతుకుంటూ వెళుతున్నాడు. దేశంలో మంచి పాపులారిటీ వున్న వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. అతడిని పక్కన పెట్టేసి కొడుకు నారా లోకేష్‌ను తీసుకొచ్చారు. జూ.ఎన్టీఆర్‌ను పార్టీలోకి తీసుకుంటే ఎక్కడ లోకేష్ బాబు వెనకబడిపోతాడోనని పక్కనపెట్టేశారు.
 
నందమూరి రాజకీయ ఆస్తిని నారా ఫ్యామిలీ వాడుకుంటున్నారు. మొన్న సుహాసిన కూకట్ పల్లి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి వెళ్లలేదు. ఎందుకంటే మళ్లీ నందమూరి ఫ్యామిలీని కరివేపాకులా వాడుకోవాలని చూశారని ఆయన కనిపెట్టేశారు. అందుకే వెళ్లలేదు. అదీ నందమూరి పౌరుషం అంటే. జూనియర్ ఎన్టీఆర్‌కు ఆ పౌరుషం వుందంటూ లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు.