1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Lokesh fire on Jagan

మీరసలు మనుషులేనా?.. జగన్ పై నిప్పులు చెరిగిన లోకేష్

Lokesh
అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల మృతిని కూడా రాజకీయానికి వాడుకుంటూ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ పై టిడిపి జాతీయ  ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు.

ట్విట్టర్ లో "జగన్  గారూ! శవాల మీద రాజకీయ లబ్ది కాసులు ఏరుకునే పైశాచిక చేష్టలను వైసీపీ ఎప్పటికీ మానుకోదా? కోడెలగారిని కేసుల పేరుతో వేధించి ఆయన బలవన్మరణానికి కారణమైనందుకు కాస్త కూడా పశ్చాత్తాపం లేకుండా, సిగ్గులేని ప్రచారాలతో రెచ్చిపోతారా? మీరసలు మనుషులేనా? మీకసలు విలువలనేవే లేవా? 
 
కోడెలగారిది ఆత్మహత్య కాదు. ఇది ముమ్మాటికీ వైకాపా ప్రభుత్వ హత్యే. దాన్ని కప్పిపుచ్చుకోడానికి కుటుంబ కలహాలు అని, కొడుకే కొట్టి చంపారని నిస్సిగ్గుగా మీ దొంగ ఛానల్ లో కథనాలు ప్రసారం చేస్తారా? కోడెలగారి కొడుకు విదేశాల్లో ఉన్న విషయం మీ గుడ్డి సాక్షి ఛానల్ కి కనపడలేదా?" అని మండిపడ్డారు. 
About Writer
ఎం
తర్వాతి కథనం
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు జపాన్ దిగ్గజం ‘సాఫ్ట్‌ బ్యాంక్‌’ ఆసక్తి