శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 11 ఆగస్టు 2018 (14:29 IST)

పెళ్లి పేరిట మైనర్ బాలిక మోసం.. లోబరుచుకుని గర్భవతిని చేశాడు.. శీలం ధర రూ.2.5 లక్షలు

పెళ్లి పేరిట మోసం చేశాడు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి ఆ బాలిక గర్భం దాల్చింది. న్యాయం కోసం పోరాడితే.. గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి బాలిక శీలానికి వెల కట్టారు. నిందితుడికి 2.5 లక్

పెళ్లి పేరిట మోసం చేశాడు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి ఆ బాలిక గర్భం దాల్చింది. న్యాయం కోసం పోరాడితే.. గ్రామ పెద్దలు  పంచాయతీ పెట్టి బాలిక శీలానికి వెల కట్టారు. నిందితుడికి 2.5 లక్షల రూపాయల జరిమానా వేసి వదిలేశారు. ఈ ఘటన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో చోటుచేసుకుంది. 
 
ఆగస్టు ఒకటో తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుడితో పాటు నలుగురు పంచాయతీ పెద్దలను అరెస్టు చేశారు. ఈ ఐదుగురిని పోలీసులు స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టుకు వారికి జ్యుడిషియల్ కస్టడీ విధించారు. 
 
వివరాల్లోకి వెళితే.. 17ఏళ్ల బాలిక వ్యవసాయం చేస్తున్న తల్లిదండ్రులకు సాయం చేస్తోంది. పత్తి పొలాల్లో పనిచేస్తున్న ఆ బాలికను పొలం యజమాని వెంకటయ్య పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లొంగదీసుకున్నాడు. శారీరక సంబంధం పెట్టుకున్నాడు. దాంతో ఆమె గర్భం దాల్చింది. బాలిక శరీరంలో మార్పులు రావడంతో తల్లి గుర్తు పట్టి ఆస్పత్రికి తీసుకుని వెళ్లింది. దాంతో విషయం బయటపడింది.