ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chitra
Last Updated : మంగళవారం, 24 మే 2016 (10:48 IST)

ఆస్తుల కోసం సొంత మరదలిని కత్తితో బెదిరించి రేప్ చేశాడు.. ఆపై నగ్నచిత్రాలను..?!

ఆస్తి కోసం ఓ కామాంధుడు అత్యంత నీచానికి ఒడిగట్టాడు. ఆస్తి కోసం సొంత మరదలిని కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన సంఘటన కెపిహెచ్‌బి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్‌లో చోటుచేసుకుంది. మరదలి పేరిట ఉన్న ఆస్తిని తన పేరిట రాయకపోతే నగ్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. 
 
పూర్తి వివరాలను పరిశీలిస్తే గుంటూరు జిల్లా తుళ్ళూరుకు చెందిన అజయ్ కూకట్ పల్లి సమీపంలోని ప్రగతి నగర్‌లో నివాసం ఉంటున్నారు. కాగా మరదలి పేరుతో స్థలం కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఏపీ రాజధాని నిర్మాణం జరుగుతుండటంతో ఒక్కసారిగా భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో మరదలి పేరున ఉన్న స్థలాన్ని ఎలాగైనా తన పేరిట రాయించుకోవాలని భావించిన అజయ్ ఆమెను బెదిరించడం మొదలెట్టాడు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని మరదలిని కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
అంతటితో ఆగకుండా నగ్నంగా ఫోటోలు తీశాడు. ఇలా తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించడం ప్రారంభించాడు. బావ వేధింపులను భరించలేని యువతి చివరకు కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించింది. నిందితుడికి ఇది వరకే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో వివాహమైందని, యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.