1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Man shot dead by minister Vanitha Conway

మంత్రి వనిత కాన్వాయ్‌ ఢీకొని వ్యక్తి మృతి

Man dead
మంత్రి తానేటి వనిత కాన్వాయ్‌ ఢీకొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులోని కనకదుర్గమ్మ ఆలయం సమీపంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

మంత్రి తానేటి వనిత కాన్వాయ్‌ ఢీకొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులోని కనకదుర్గమ్మ ఆలయం సమీపంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వృద్ధుడిని మంత్రి కాన్వాయ్‌లోని ఓ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది.

దీంతో ద్విచక్రవాహనం అదుపుతప్పగా.. ఆ వెంటనే మంత్రి ఇన్నోవా కారు కూడా ఢీకొట్టి రహదారి డివైడర్‌ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మంత్రి వనిత స్వల్ప గాయాలతో బయటపడగా.. ద్విచక్రవాహనంపై ఉన్న వృద్ధుడు మాత్రం తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడు భీమవరం ప్రాంతానికి చెందిన కలసూరి వెంకటరామయ్య (70)గా గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు
About Writer
ఎం
తర్వాతి కథనం
రాజ్​భవన్​లో ప్రజాదర్బార్ నిర్వహిస్తాం: తమిళిసై