గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 19 డిశెంబరు 2022 (14:55 IST)

ఏపీలో పంచాయతీ రాజ్‌ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

apgovtlogo
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ జారీ అయింది. ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలో మండల కో ఆర్డినేటర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అబ్యర్థులు మండల కేంద్రాల్లోని కార్యాలయాల్లో పని చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీని ఈ నెల 20 మంగళవారంగా నిర్ణయించింది.
 
ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం జిల్లా వ్యాప్తంగా 22 మండల కోఆర్డినేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు బీఎస్సీ కంప్యూటర్, బీసీఏ, ఎంసీఏ, బీటెక్ సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ వంటి కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. 
 
ఈ పోస్టులకు అర్హులైన వారిని రాతపరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం విడుదల ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మంగళవారం లోపు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో పంపించాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేలు వేతనంగా ఇస్తారు.