1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Matsya Darshini Aquarium Vizag

విశాఖ సాగర్ తీరంలో అండర్ వాటర్ టన్నెల్

vizag fish aquarium
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సముద్రతీర ప్రాంతాల్లో ఒకటైన విశాఖపట్టణంలో సముద్రగర్భంలో చేపల ఆక్వేరియంను నిర్మించారు. వివిధ దేశాల్లోని ఎన్నో రకాల చేపలు ఈ అండర్ వాటర్ టెన్నెల్‌లో ఉన్నారు. ఈ అండర్ వాటర్ ఆక్వేరియం వింతలు విశేషాలను ఓసారి పరిశీలిస్తే, 
 
ఈ ఫిష్ టెన్నెల్‌ ఎగ్జిబిషన్ విశేషంగా ఆకట్టుకుంటుంది. దాదాపు 2 వేలకు పైగా వివిధ రకాలైన చేపలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఆస్కార్ చేపలు ఈ ప్రదర్శనలో హైలెట్‌గా నిలిచాయి. ఈ ఫిష్ టెన్నెల్ ఎగ్జిబిషన్ మూడు నెలల పాటు కొనసాగనుంది. 
 
విశాఖ బీచ్ రోడ్డులోని పోలీస్ మెస్ వెనుక గ్రౌండ్‌లో ఈ ఫిష్ టెన్నెల్‌ను ప్రారంభించారు. ఈ ఆక్వేరియంను చూసేందుకు అనేక మంది ఈ ప్రాంతానికి క్యూకడుతున్నారు. సందర్శకులు తమ వెనుక ఈత కొడుతున్న చేపలతో సెల్ఫీలు దిగుతూ మురిసిపోతున్నారు. ఎలక్ట్రిక్ ఈల్స్, స్టార్ ఫిష్, హనీమూన్ ఫిష్ వారిని మరింతగా ఆకర్షిస్తున్నాయి. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
తోడేళ్లు గుమికూడుతున్నాయ్... మీ బిడ్డ సింహంలా ఒంటరిగా వస్తున్నాడు... సీఎం జగన్