శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 2 మార్చి 2018 (17:00 IST)

ప్రధానికి పతనం ప్రారంభమయ్యింది... దేవుడు కూడా కాపాడలేడు... బుట్టా సంచలనం

ఎపి సిఎం చంద్రబాబునాయుడు కేంద్రంపై హెచ్చరికల సంకేతాలు పంపుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో ఉన్న నేతలు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. బిజెపిలోని ప్రధాన నాయకులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు... మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు అ

ఎపి సిఎం చంద్రబాబునాయుడు కేంద్రంపై హెచ్చరికల సంకేతాలు పంపుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో ఉన్న నేతలు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. బిజెపిలోని ప్రధాన నాయకులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు... మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు అందరూ వరుసగా కేంద్రంలోని బిజెపిని టార్గెట్ చేశారు. సహనం కోల్పోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. నిన్న జె.సి.దివాకర్ రెడ్డి, నేడు ఎంపి బుట్టారేణుక. ఇలా రోజుకో ప్రజాప్రతినిధి ప్రధానిపై విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్నారు.
 
కర్నూలు ఎంపి, బుట్టా రేణుక ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే మాత్రం బిజెపి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ప్రధాని మోడీకి పతనం ప్రారంభమయ్యింది.. ఇక దేవుడు కూడా ఆయన్ను కాపాడలేడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదాకు సరిపోయే ప్యాకేజీని ఇస్తామన్నారు. ఇప్పుడూ రెండూ లేకుండా పోయాయి. ఇన్ని రోజులు వేచి చూశాం.. ఇక ఆగడం సాధ్యం కాదని తేల్చేశారు బుట్టా రేణుక.