1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 10 నవంబరు 2021 (12:26 IST)

నెల్లూరు అమ్మాయి... హైద‌రాబాదులో ఆత్మ‌హ‌త్య‌...ఎందుకు?

హైద‌రాబాదులోని ఒక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజేంద్రనగర్‌లో చోటు చేసుకుంది. రాజేంద్రనగర్‌ సిఐ కనకయ్య కథనం మేరకు, నెల్లూరుకు చెందిన సుదీప్తి (27) అనే అవివాహిత బండ్లగూడజాగీర్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఉంటూ ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా పనిచేస్తోంది.


ఈ నెల 6 న అనారోగ్యంతో ఆమె స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లింది. మూడు రోజులుగా ఆమె ఆసుపత్రిలో చికిత్స పొంది పూర్తిగా కోలుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆమె ఆసుపత్రి నుండి డిశ్ఛార్జి కావాల్సి ఉంది. ఆ రోజు ఉదయం 9 గంటల సమయంలో సుదీప్తి గదిలోకి నర్సు వెళ్లగా, లోపలి నుంచి తలుపు గడియపెట్టుకొని ఉంది. సిబ్బంది తలుపు బద్దలు కొట్టి లోపలికెళ్లి చూశారు. సుదీప్తి ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.


యువతి తల్లి బెంగళూరులో ఆమె సోదరుడి దగ్గర ఉంటోంది. వెంటనే ఆసుపత్రి నిర్వాహకులు రాజేంద్రనగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అస‌లు ఆమె ఎందుకు ఆత్మహ‌త్య‌కు పాల్ప‌డింద‌నే కార‌ణాల కోసం విచార‌ణ జ‌రుపుతున్నారు.