1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 జనవరి 2022 (15:03 IST)

రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించిన ఏపీ సర్కారు

ఏపీతో పాటు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న కోవిడ్ పరిస్థితులపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తర్వాత ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. 
 
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లోభాగంగా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూను విధించాల్సిందిగా ఆదేశించారు. అలాగే, భౌతికదూరం పాటించేలా, మాస్కులు ఖచ్చితంగా ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
ప్రధానంగా వ్యాపార దుకాణాలు, షాపుల సముదాయాల్లో కోవిడ్ ఆంక్షలు పాటించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇండోర్స్‌లలో 100 మంది మంచికుండా చూడాలని సీఎం ఆదేశించారు. సినిమా థియేటర్లలో 50 శాం ఆక్యుపెన్షీతో సినిమాల ప్రదర్శన జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.