1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 23 ఏప్రియల్ 2023 (10:57 IST)

పోరంకి అనుమోలు గార్డెన్‌లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు.. చీఫ్ గెస్ట్‌గా రజనీకాంత్

ntramarao
స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. విజయవాడలోని పోరంకి అనుమోలు గార్డెన్‌లో వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లుచేశారు. ఈ నెల 28వ తేదీన జరిగే ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఎన్టీఆర్ జీవితాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించేలా వెబ్‌‍సైట్, యాప్‌ను రూపకల్పన చేయగా, వీటిని ఆయన ఆవిష్కరిస్తారు. 
 
అలాగే, ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణతో పాటు అనేక మంది సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఎన్టీఆర్‌పై రాసిన తొలి పుస్తకాన్ని సీనియర్ జర్నలిస్ట్ ఎస్. వెంకటనారాయణ కూడా ఈ వేడుకలో పాల్గొంటారు. మే 28వ తేదీన ఎన్టీఆర్ 100వ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. 
 
ఇందుకోసం టీడీ జనార్ధన్ నేతృత్వంలో ఒక సావనీర్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జీవితాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించేలా వెబ్‌సైట్, యాప్‌ను కూడా తీసుకునిరానున్నారు. ఈ రెండింటి ఆవిష్కరణ కార్యక్రమాలను హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తారు. 
 
అలాగే, ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలతో పాటు రెండు పుస్తకాలను, ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలతో ఓ పుస్తకం, బహిరంగ సమావేశాల్లో చేసిన ప్రసంగాల సంకలనంతో మరో పుస్తకం తీసుకునిరానున్నారు. చారిత్రక ప్రసంగాల పేరుతో తీసుకొచ్చే ఈ పుస్తకాలను ఈ నెల 28వ తేదీన పోరంకిలోని అనుమోలు గార్డెన్స్‌లో ఆవిష్కరిస్తారు.