మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (10:53 IST)

బోల్తాపడిన పైవేట్ ట్రావెల్స్‌ బస్సు.. 20మందికి గాయాలు

road accident
విజయవాడ, గొల్లపూడి సెంటర్‌ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తున్న బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో బస్సు డివైడర్‌లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. 
 
ఈ బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు.