వైసీపీకి మరో ఎమ్మెల్యే షాక్-గన్నవరం ఎమ్మెల్యే బైబై.. కాంగ్రెస్లో చేరిక
Kondeti Chittibabu
పి.గన్నవరం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసిన కొండేటి చిట్టిబాబు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో పి.గన్నవరం టిక్కెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని విప్పర్తి వేణుగోపాల్కు సీఎం జగన్ కేటాయించారు.
దీంతో అప్పటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే చిట్టిబాబు.. శనివారం పార్టీకి గుడ్బై చెప్పారు. వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వెంటనే చిట్టిబాబు పార్టీ మారడం విశేషం.
