శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 31 మే 2018 (19:32 IST)

అనుమానంలేదు... ఆపరేషన్ గరుడే... పవన్-జగన్ కలిసి...

తాజాగా దేశంలో వెలువడిన నాలుగు ఉప ఎన్నికల ఫలితాల నేపధ్యంలో ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. భాజపా వ్యవహార శైలి చూస్తుంటే, నటుడు శివాజీ చెప్పినట్లే ఆపరేషన్ గరుడ ప్లాన్ చేసిందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఒకవైపు జగన్ మోహన్ రెడ్డిత

తాజాగా దేశంలో వెలువడిన నాలుగు ఉప ఎన్నికల ఫలితాల నేపధ్యంలో ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. భాజపా వ్యవహార శైలి చూస్తుంటే, నటుడు శివాజీ చెప్పినట్లే ఆపరేషన్ గరుడ ప్లాన్ చేసిందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఒకవైపు జగన్ మోహన్ రెడ్డితో లాలూచీ రాజకీయాలు చేస్తూ, ఇంకోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో తెలుగుదేశం పార్టీ పైన విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు. 
 
ఇవే కాకుండా ఐవైఆర్ కృష్ణారావుతో పుస్తకాలు, రమణ దీక్షితులతో ఆరోపణలు వంటివన్నీ చూస్తే ఆపరేషన్ గరుడ నిజమేనన్న భావన కలుగుతోందన్నారు. ఐతే భాజపా ఆపరేషన్లు రివర్సవుతున్నాయనీ, అవన్నీ వాళ్లకే తగులుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. కర్నాటకలో ప్రారంభమైన భాజపా పతనం 2019 నాటికి పూర్తిగా ముగుస్తుందని జోస్యం చెప్పారు. 
 
ఒకవైపు ఏ ఎన్నిక జరిగినా భాజపా ఘోరంగా పరాజయాలను చవిచూస్తుంటే వాటి నుంచి గుణపాఠం నేర్చుకోవాలన్న బుద్ధి కూడా వారికి రావడం లేదని విమర్శించారు యనమల. తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి వైదొలగిన నాటి నుంచి తమ పార్టీపై భాజపా కక్ష పెంచుకుని నిధులు విడుదల చేయడం లేదంటూ విమర్శించారు.