శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (19:17 IST)

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం హస్తినబాట పట్టిన పవన్ కళ్యాణ్

ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో కేంద్రం పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని చూస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు కూడా వెల్లడించాయి. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో పెను రాజకీయ సునామీకి దారితీసింది. ఈ ప్లాంట్‌ను ప్రైవేట్ పరంకాకుండా ఉండేందుకు అన్ని రాజకీయ పార్టీల నేతలు సిద్ధమవుతున్నారు.
 
అలాగే, వైజాగ్ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించాలని జనసేన నిశ్చయించింది. ఈ క్రమంలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఢిల్లీ పయనమయ్యారు. 
 
పవన్‌తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా హస్తినకు వెళ్లారు. తెలుగు వారి ఆత్మగౌరవానికి, ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునే అంశంపైనా, రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపైనా పవన్, నాదెండ్ల బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చిస్తారని జనసేన పార్టీ సోషల్ మీడియాలో వెల్లడించింది.