మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 జూన్ 2023 (06:03 IST)

క్రిమినల్స్ అంటే చిరాకు.. గోదావరి తల్లిలా ఈ నేలను..? పవన్ కల్యాణ్

pawan kalyan
కాకినాడ జిల్లా పిఠాపురంలో వారాహి విజయ యాత్రను జనసేనాని పవన్ కల్యాణ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఏపీలోని సర్కారు ఏకిపారేశారు. 
 
శ్రీపాద శ్రీ వల్లభుడు పుట్టిన పిఠాపురం గడ్డకు రావడాన్ని అదృష్టంగా భావిస్తానని తెలిపారు. ఒక దశాబ్ద కాల ప్రయాణంలో తాను ఎందుకు గట్టిగా నిలబడ్డాను అంటే అది ప్రజల భవిష్యత్ కోసమేనని ఉద్ఘాటించారు. గోదావరి తల్లి ఈ నేలను ఎలా అంటిపెట్టుకుని ఉంటుందో, తాను కూడా నేలను అంటిపెట్టుకుని ఉంటాను అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తనకు క్రిమినల్స్ అంటే చిరాకు అని స్పష్టం చేశారు. 
 
నేరాలు చేసి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లా మనల్ని పాలించేది. ఈ దరిద్రులా మనల్ని పాలించేది. ఈ సన్నాసులా మనల్ని పాలించేది. గూండా గాళ్లు, రౌడీలు, హంతకులు... సిగ్గుండాలి మనకు ఇలాంటి వాళ్లతో పాలింపబడడానికి.. అంటూ పవన్ కల్యాణ్ ఆగ్రహంతో ఊగిపోయారు. తానేమీ సినిమా మాటలు మాట్లాడడంలేదని, సినిమాల కంటే రియల్ లైఫ్ లోనే ఎక్కువ చేస్తానని తెలిపారు.