1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By డివి
Last Modified: శుక్రవారం, 22 జనవరి 2021 (12:53 IST)

కాషాయం దుస్తుల్లో పవన్ కల్యాణ్, జగన్‌కు సరైనోడట

కాషాయం దుస్తులలో మెరిశారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్. కొన్ని రోజుల క్రితం వకీల్ సాబ్ మూవీ షూటింగ్‌ని కంప్లీట్ చేశాడు. కాగా పవన్ కల్యాణ్ గత మూడు రోజులుగా తిరుపతిలో జనసేన పార్టీకి సంబంధించిన కార్యక్రమాలతో బిజి బిజీగా ఉన్నారు.
 
శుక్రవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు పవర్ స్టార్. ఆలయం నుంచి వస్తున్న జనసేనానిని ఫొటోగ్రాఫ‌ర్స్ కెమెరాలో బంధించ‌గా ఆయ‌న ఫొటోలు వైర‌ల్‌గా మారాయి. కాషాయ దుస్తుల‌లో ప‌వ‌న్‌ని చూసిన ఫ్యాన్స్ ముగ్ధుల‌వుతున్నారు. జగన్‌కు సరైనవాడు పవన్ అని నెటిజన్స్ కామెట్ చేస్తున్నారు.