Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ క్యాలెండర్లు, డైరీలు సిద్ధం

Written By ఎం
Updated: గురువారం, 17 సెప్టెంబరు 2020 (06:49 IST)
2021వ సంవత్సరానికి సంబంధించి టీటీడీ క్యాలెండర్లు, డైరీలు విక్రయానికి సిద్ధమవుతున్నాయి. 12 పేజీల ఆయిల్‌ ప్రింటెడ్‌ క్యాలెండర్లు 15 లక్షలు, పెద్ద డైరీలు 8 లక్షలు, చిన్న డైరీలు 2 లక్షలతో పాటు కొన్ని టేబుల్‌ క్యాలెండర్లు సిద్ధమవుతున్నాయి.

వీటితో పాటు రూ.15 ధరతో శ్రీవారు, అమ్మవారి క్యాలెండర్లు, రూ.20 ధర కలిగిన తెలుగు పంచాంగం క్యాలెండర్లు కూడా తయారవుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టువస్త్రాలు అందించేందుకు ఈ నెల 23న తిరుమలకు వస్తున్న సీఎం జగన్‌ చేతులమీదుగా వీటిని ఆవిష్కరింపజేయనున్నారు. 

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి. కరోనా నివారణ చర్యల్లో భాగంగా వార్షిక బ్రహ్మోత్సవాలను ఆలయం లోపలే ఏకాంతంగా నిర్వహించనున్నారు. కాగా, తిరుమలలో ఏసీ గదుల అద్దెను టీటీడీ పెంచింది. ప్రస్తుతం రూ.1000 ఉన్న అద్దెను రూ.1500 చేశారు. 

అన్నీ చూడండి

ప్రదీప్ రావత్ అంత్యక్రియలకు హాజరైన అమీర్ ఖాన్, అశుతోష్ గోవారికర్

మగవాడికి కమిట్‌మెంట్ ఇవ్వనిదే సినిమా ఛాన్సే కాదు సీరియల్ ఛాన్స్ కూడా రాదు, యువతి వీడియో వైరల్

Genelia Deshmukh: అభిమానుల ప్రేమతో 39వ పుట్టినరోజు జరుపుకున్న జెనీలియా దేశ్‌ముఖ్

Jayam Ravi: భార్యతో విడాకులు.. వడ్డీ కాసుల వాడిగా జయం రవి

Anand Deverakonda :బీచ్ పోస్టర్‌తో ఆనంద్ దేవరకొండ... ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments