ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2022 (17:04 IST)

రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్‌గా పీటీ ఉష - సాయిరెడ్డి

vijayasaireddy
ఏపీకి చెందిన వైకాపా రాజ్యసభ సభ్యుడు వై.విజయసాయిరెడ్డి మరోమారు వార్తలకెక్కారు. ఆయన పేరును రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానెల్‌లో చేర్చారు. అయనతో పాటు తొలిసారి రాజ్యసభకు ఎంపికైన మాజీ అథ్లెట్ పీటీ ఉష పేరును కూడా చర్చడం గమనార్హం. 
 
నిజానికి రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్ జాబితాలో పది రోజుల క్రితమే విజయసాయి రెడ్డి పేరును చేర్చారు. ఆ తర్వాత చోటుచేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆయన పేరును తొలగించారు. 
 
ఇపుడు మళ్లీ ఆయన పేరును వైస్ ఛైర్మన్‌గా నియమించారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగ్దీష్ ధన్కర్ ప్రకటించారు. పరుగుల రాణి పీటీ ఉషాను కూడా ప్యానెల్‌ వైస్ ఛైర్మన్‌గా నియమించారు. ఈ సందర్భంగా వారిద్దరికి ఉప రాష్ట్రపతి అభినందించారు.