1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Rajamouli proves he is real Baahubali

హుదూద్ తుఫాను.. 160 ఏళ్ల నాటి కాశింకోట పాఠశాలను నిర్మించిన రాజమౌళి

బాహుబలి మేకర్ రాజమౌళి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2014లో సంభవించిన హుదూద్ తుఫాను తీవ్ర నష్టాన్ని సృష్టించింది. ఈ తుఫాను తాకిడికి విశాఖ అస్తవ్యస్తమైంది. ఆపై ఏపీ సర్కారు చేపట్టిన చర

Rajamouli
బాహుబలి మేకర్ రాజమౌళి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2014లో సంభవించిన హుదూద్ తుఫాను తీవ్ర నష్టాన్ని సృష్టించింది. ఈ తుఫాను తాకిడికి విశాఖ అస్తవ్యస్తమైంది. ఆపై ఏపీ సర్కారు చేపట్టిన చర్యలు, ఎందరో పెద్ద మనసు చేసుకుని చేసిన సాయంతో ఆ నగరానికి పూర్వపు రూపరేఖలు సంతరించుకున్నాడు.
 
ఇదే తుఫానులో విశాఖలోని 160 ఏళ్ల నాటి కాశింకోట పాఠశాల చాలామటుకు కూలిపోయింది. ఈ భవనం నిర్మాణ పనులను ప్రముఖ దర్శకుడు, జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి తన భుజాలపై వేసుకున్నారు. రాజమౌళితో పాటు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, శోభనాద్రి, ప్రశాంతి కలిసి నాలుగు గదుల భవనం నిర్మించేందుకు ముందుకొచ్చారు. ప్రస్తుతం ఈ భవనం పూర్తయ్యింది. త్వరలో దీన్ని ప్రారంభించనున్నారు.
తర్వాతి కథనం
''ఆధార్'' ప్రపంచ గుర్తింపు-2017 హిందీ పదంగా ఆక్స్‌ఫర్డ్‌లో చేరింది