సంబంధిత వార్తలు
- మూడు నెలలుగా నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు : వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి
- గ్రాండ్స్లామ్ కెరీర్ చివరి మ్యాచ్లో సానియా మీర్జాకు నిరాశ
- 'అక్కినేని.. తొక్కినేని' అనే మాటలు ఫ్లోలో వచ్చాయి.. రాద్దాంతం వదు : బాలకృష్ణ
- రాజమౌళి ప్రసంగంపై కంగనా రనౌత్ ప్రశంసల వర్షం
- 'తిట్టు తిట్టు - పోస్టు పట్టు'.. కొత్త స్కీమ్ ప్రారంభించిన సీఎం జగన్ : ఆర్ఆర్ఆర్ వ్యంగ్యాస్త్రాలు
కోటంరెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధం... అందుకే ఆరోపణలు : సజ్జల రామకృష్ణారెడ్డి
నెల్లూరు రూరల్ వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అధికార వైకాపా నేతలను ఉలికిపాటుకు గురిచేసింది. అధికార పార్డీకే చెందిన ఎమ్మెల్యే ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగారు.
తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు కోటంరెడ్డి సిద్ధమైన తర్వాతే ఆయన ఆవిధంగా మాట్లాడుతున్నారని అన్నారు. అయినా ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. కొంతమందిని ఎలా లాక్కోవాలో చంద్రబాబుకు బాగా తెలుసని సజ్జల వ్యాఖ్యానించారు.
"ఇకపోతే కోటంరెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది. ఆయనే తన ఉద్దేశ్యాలను వెల్లడించిన తర్వాత ఏం చర్యలు తీసుకోగలం. సీఎం జగన్ ప్రజలను నమ్ముకుని పాలన చేస్తున్నారేగానీ ఫోన్ ట్యాపింగ్లను నమ్ముకుని కాదన్నారు. ఎవరు ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చు. పదవి రాలేదన్న అసంతృప్తి ఉండటం వేరు. బహిరంగంగా ఇలాంటి ఆరోపణలు చేయడం వేరు అని ఆయన అన్నారు.
