మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 27 డిశెంబరు 2017 (08:58 IST)

చంద్రుడూ.. పవర్‌స్టారూ... ఇద్దరూ తోడుదొంగలే : కత్తి మహేష్

తెలుగు సినీ విమర్శకుడు కత్తి మహేష్ మరోమారు నోరుజారాడు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

తెలుగు సినీ విమర్శకుడు కత్తి మహేష్ మరోమారు నోరుజారాడు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ తోడుదొంగలేనంటూ వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై కత్తి మహేష్ ఓ ట్వీట్ చేశాడు. 
 
విజయవాడ పాతిమా కాలేజీ విద్యార్థుల సమస్యను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని పరిష్కరించాలని ఇటీవల విజయవాడ పర్యటన సందర్భంగా కోరారు. ఇదే అంశంపై ఆయన మరోమారు చంద్రబాబు సర్కారుకు మంగళవారం లేఖ కూడా రాశారు. 
 
దీనిపై కత్తి మహేష్ స్పందించారు. "మొత్తానికి ఫాతిమా కాలేజ్ విషయంలో ఇంతకాలానికి చంద్రబాబు ఒకే అన్నాడన్నమాట. ఈరోజు పవన్ కళ్యాణ్ ట్విట్ చేశాడు. తోడుదొంగలు గేమ్ బాగానే ఆడుతున్నారు" అంటూ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ కామెంట్స్ పోస్ట్ చేశాడు. 
 
కాగా, గత కొంతకాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై కత్తి మహేష్ మాటలతూటాలు పేల్చుతున్న విషయం తెల్సిందే. దీంతో కత్తికి పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. దీంతో కత్తి మహేష్ 'టాక్ ఆఫ్ ది టౌన్‌'గా మారిపోయాడు. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేసి మరోమారు వార్తలకెక్కాడు.