1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 మార్చి 2022 (12:44 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ బాదుడు - 7 తర్వాత ఎపుడైనా...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో బాదుడుకు శ్రీకారం చుట్టనుంది. భూముల విలువను పెంచి, తద్వారా రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా వసూలు చేయనున్నారు. ఈ రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుపై ఇప్పటికే అనేక విధాలుగా కసరత్తులు చేసిన ఏపీ ప్రభుత్వం... ఈ చార్జీల బాదుడును 10 నుంచి 50 శాతం మేరకు పెంచేందుకు సిద్ధమైంది. ఈ బాదుడు కూడా ఈ నెల 7వ తేదీ తర్వాత ఎపుడైనా చేపట్టవచ్చు. 
 
ఈ భూముల విలువను పెంచేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తిచేసింది. ఇప్పటివరకు ఎంతెంత విలువలున్నాయి?, కొత్తగా పెంచేందుకు రూపొందించిన ప్రతిపాదనలు ఏమిటి? పెరుగుదల ఎంత? అనే వివరాలను రూపొందించారు. జిల్లాల జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ల నుంచి ఆ ప్రతిపాదనలకు ప్రాథమికంగా అనుమతి తీసుకున్నారు. 
 
రెండు రోజుల క్రితమే ఈ పని పూర్తచేసిన సబ్ రిజిస్ట్రార్లు పెరుగదలకు సంబంధించిన వివరాలను రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్ ఐజీఆర్ఎస్ డాట్ కామ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. దీంతో ఈ నెల 7వ తేదీ తర్వాత ఎపుడైనా రిజిస్ట్రేషన్ చార్జీల బాదుడును మొదలుపెట్టనున్నారు.