1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 28 జనవరి 2015 (16:36 IST)

అనంత టీడీపీలో ముసలం: బాలయ్య పీఏపై టి.తమ్ముళ్ల ఫైర్!

అనంతపురం జిల్లా టీడీపీలో ముసలం పుట్టింది. హిందూపురం శాసన సభ్యుడు, తెలుగు హీరో నందమూరి బాలకృష్ణ పీఏ పైన పలువురు తెలుగు తమ్ముళ్లు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
బాలకృష్ణ పీఏ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. చిలమత్తూరులో తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశం రసాభాసగా మారింది. 
 
ఎంపీపీ, బ్రహ్మానంద రెడ్డి వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. ఈ సమయంలో బాలకృష్ణ పీఏ పైన బ్రహ్మానంద రెడ్డి వర్గీయులు మండిపడ్డారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.