సంబంధిత వార్తలు
- టీడీపీ సీనియర్ నేత జనార్ధన్ థాట్రాజ్ మృతి
- చెన్నై ఓఎంఆర్ రోడ్డులో జగన్ ఇంద్రభవనం.. ఆ ఇంటికి రూ. 122 కోట్ల విలువగల పర్నిచర్: టీడీపీ సంచలన ఆరోపణలు
- నేడు రాష్ట్రపతిని కలవనున్న టీడీపీ ఎంపీలు.. ఎందుకో తెలుసా?
- కరోనా టైంలోనూ వైసీపీ నేతలకు కమీషన్ల కక్కుర్తి: టిడిపి ఎమ్మెల్యే
- స్పీకర్ తమ్మినేని వాదనతో ఏకీభవిస్తున్నా: టీడీపీ రాజ్యసభ సభ్యుడు సంచలన ప్రకటన
అత్యాచారానికి గురైన బాలికను దత్తత తీసుకున్న టీడీపీ
రాజమండ్రిలో దళిత మైనర్ బాలిక(16)పై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. టీడీపీ మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం బుధవారం రాజమండ్రి సందర్శించి బాధితురాలిని పరామర్శించిన అంశం విదితమే.
బాధితురాలి పరిస్థితి గురించి టీడీపీ ప్రతినిధుల బృందం వివరించగానే చంద్రబాబు చలించిపోయారు. వెంటనే బాధితురాలికి రూ2లక్షల ఆర్ధికసాయం అందించాలని పార్టీ నాయకులను ఆదేశించారు.
దళిత బాలిక పదో తరగతి దాకా చదువుకుందని పార్టీ నాయకులు ఇచ్చిన సమాచారం మేరకు, ఆమెను పార్టీ తరఫున దత్తత చేసుకుని చదివించే బాధ్యతను టీడీపీ తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
బాధితురాలిలో ఆత్మవిశ్వాసం కలిగించాలని, టీడీపీ అండగా ఉంటుందనే భరోసా కల్పించాలని చంద్రబాబు కోరారు. ఇటువంటి దుర్మార్గాలపై పోరాడే యోధురాలిలా ఆమెను తీర్చిదిద్దాల్సిన బాధ్యత సమాజంపైనే ఉందన్నారు.
