1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 20 జూన్ 2020 (16:26 IST)

అతడు రాంగ్ గైడెన్స్ ఇవ్వడం వల్లే ఓటు మురిగిపోయింది.. ఎమ్మెల్యే భవానీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార వైకాపా తరపున పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు సంపూర్ణ మెజార్టీతో గెలుపొందారు. టీడీపీ తరపున పోటీ చేసిన వర్ల రామయ్య మాత్రం ఓడిపోయారు. అయితే, ఈ ఎన్నికల్లో తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ, అది చెల్లలేదు. ఆమె చేసిన చిన్న తప్పు వల్ల ఆ ఓటు మురిగిపోయింది. దీనిపై తెదేపా ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చారు. 
 
రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌లో ఎలా ఓటు వేయాలో ముందే శిక్షణ ఇచ్చినా, తాను పోలింగ్ సమయంలో పొరబడ్డానని తెలిపారు. ఒకటి అని వేయాల్సిన చోట టిక్ మార్క్ పెట్టానని వెల్లడించారు. ఈ విషయంలో తనదే పొరపాటు అని స్పష్టం చేశారు.
 
పైగా, రాజ్యసభ ఎన్నికల పోలింగులో పాల్గొనడం ఇదే మొదటిసారి అని, అయితే, అక్కడున్న సిబ్బందిని టిక్ పెట్టవచ్చా అని అడిగితే వారు ఓకే చెప్పారని, దాంతో టిక్ పెట్టానని వివరించారు. 
 
ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకు తెలియజేశానని భవాని వెల్లడించారు. లోపల ఉన్న సిబ్బందిలో ఓ వ్యక్తి తాను అడిగినప్పుడు తెలియదు అని చెప్పివుంటే తమ ఏజెంట్లను అడిగి సందేహ నివృత్తి చేసుకునేదాన్నని, అతడు రాంగ్ గైడెన్స్ ఇవ్వడంతో తాను కూడా తప్పుగా టిక్ చేయాల్సి వచ్చిందని తెలిపారు.