గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 జనవరి 2020 (13:18 IST)

మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు.. మహిళల కంటతడి (video)

మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు.. అంటూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో టీడీపీ ఎమ్మెల్యేల పాదయాత్ర జరుగుతోంది. టీడీపీ మాజీ ఎంపి నిమ్మల ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా గోరంట్లలో సోమవారం పాదయాత్ర చేపట్టారు. అమరావతి రాజధాని ఒక్కటే ఉండాలంటూ.. రైతులు, జేఏసీ నాయకులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. గోరంట్ల నుండి పెనుగొండ వరకు పెద్ద ఎత్తున కొనసాగుతోన్న ఆపై పెనుగొండకు చేరుకుంటుంది. పాదయాత్ర అనంతరం పెనుగొండలో అధికారికి వినతిపత్రాన్ని ఇవ్వనున్నారు.
 
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోద ముద్ర వేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాజధాని మహిళా రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ... తమకు అన్యాయం చేయొద్దంటూ బోరున విలపించారు. పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల అభివృద్ధి అంటూ కొత్తగా తమను ఇబ్బంది పెట్టేలా ఎలా నిర్ణయాలు తీసుకుంటారని రాజధాని మహిళలు ప్రశ్నిస్తున్నారు.