శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (09:37 IST)

పేపర్ బాయ్‌గా అవతారమెత్తిన టీడీపీ ఎమ్మెల్యే

nimmala ramanaidu
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేపర్ బాయ్‌గా అవతారమెత్తాడు. ఆయన ఆదివారం ఉదయం ప్రతి ఇంటింటికి వెళ్లి దినపత్రికలను పంపిణీ చేశారు. వెస్ట్ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఆయన పేపర్ బాయ్‌గా అవతారమెత్తాడు. ఆదివారం వేకువజామునే పట్టణంలోని మావుళ్ళమ్మపేటకు చేరుకున్న ఆయన స్థానిక పేపర్ బాయ్స్‌తో కలిసి వాటిని చందాదారులకు పంపిణీ చేసేందుకు సమాయత్తమయ్యారు. ఒక సైకిల్‌పై పత్రికలకు పెట్టుకుని 31వ వార్డులోని నాగరాజుపేట, తదితర ప్రాంతాల్లోని చందాదారుల ఇంటికి వెళ్లి పేపర్ వేశారు. 
 
టిడ్కో ఇళ్లళో మిగిలిన పది శాతం పనులు పూర్తి చేసి వాటిని ఇవ్వడంతో ప్రభుత్వం చేస్తున్న జాబ్యాన్ని లబ్దిదారులకు వివరించేందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు ఆయన తెలిపారు. 
 
ఆయా ప్రాంతాల్లో పత్రికలు తీసుకోవడానికి వచ్చిన వారికి ప్రభుత్వ తీరును, పట్టణవాసులకు పది కిలోమీటర్ల దూరంలో ఇళ్ల స్థలాలు కేటాయించిన విధానాన్ని వివరించారు. 
 
ప్రతి నెలా నాలుగు రోజులు చందాదారులను కలిసి ఇలా దినపత్రికలు అందిస్తూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తెలియజేస్తానని, మరో నాలుగు రోజులు పారిశుద్ధ్య పనులు చేపట్టి నిరసనకు దిగుతానని ఎమ్మెల్యే రామానాయుడు వెల్లడించారు.