1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 జులై 2022 (08:39 IST)

జగన్ అక్రమాస్తుల కేసు - కేవీ బ్రహ్మానంద రెడ్డికి చుక్కెదురు

Court
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆరో నిందితుడుగా ఉన్న మాజీ ఐఆర్ఏఎస్ అధికార కేవీ బ్రహ్మానంద రెడ్డి విచారణ ఎదుక్కోక తప్పదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. వాన్‌పిక్ ప్రాజెక్టు కేసులో ఆయనపై విచారణను నిలిపేయలేమని, ప్రాథమిక దశలోనే ఆయనను కేసు నుంచి తప్పించలేమని కోర్టు పేర్కొంది. 
 
రికార్డుల్లో ఉన్న ఆధారాలతో శిక్ష పడుతుందా లేదా అన్నది విచారణ ఆఖరులో తేలుతుందన వ్యాఖ్యానించింది. విచారణకు తగినంత సమాచారం ఉందని అభిప్రాయపడింది. అందువల్ల సీబీఐ కోర్టు 2016 ఆగస్టులో వెలువరించిన తీర్పును తప్పుపట్టలేమంటూ బ్రహ్మానందరెడ్డి పిటిషన్‌ను కొట్టివేస్తూ 53 పేజీల తీర్పును హైకోర్టు వెలువరించింది.
 
గతంలో సీబీఐ కోర్టు తనపై కేసును కొట్టివేయడానికి నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మాజీ అధికారి బ్రహ్మానందరెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ఇటీవల తీర్పు వెలువరించారు. బ్రహ్మానందరెడ్డిపై విచారణను నిలిపేయలేమని, ప్రాథమిక దశలోనే ఆయనను కేసు నుంచి తప్పించలేమన్నారు.