బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 18 మే 2019 (13:11 IST)

నమ్మించి తీసుకెళ్లాడు.. ఫోన్ చేసి ఫ్రెండ్స్‌ను పిలిచి రేప్ చేశాడు...

తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా రాయవరం గ్రామంలో ఓ దళిత యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. తన స్నేహితుడు నమ్మించి తీసుకెళ్లి ఫ్రెండ్స్‌తో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణంగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాయవరం గ్రామానికి చెందిన 12 యేళ్ళ బాలిక ఇటీవల తన స్నేహితుడుతో కలిసి బైకుపై షికారుకు వెళ్ళింది. అతను షికారుకు తీసుకెళ్లకుండా ఎవరూ లేని చోటికి తీసుకెళ్లాడు. అక్కడ నుంచి తన ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి రప్పించాడు. 
 
ఆ తర్వాత ముగ్గురూ కలిసి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగని ఆ ముగ్గురు కామాంధులు రాత్రంతా లైంగికంగా వేధించారు. మరుసటిరోజు వేకువజామున అక్కడే వదిలేసి పారిపోయారు. 
 
అయితే, రాత్రంతా బాలిక ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టగా, ఆ బాలిక అచేతన స్థితిలో కనిపించింది. ఇంటికి తీసుకెళ్లి ఆరా తీయగా తనకు జరిగిన ఘోరాన్ని వెల్లడించింది. ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు జగదేవపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.