గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 జులై 2024 (08:06 IST)

ఆగస్టు 1 నుంచి 21 వరకు స్వామి పుష్కరిణి మూసివేత

srivari pushkarini
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) స్వామి పుష్కరిణినిని శుభ్రపరిచే,  పునరుద్ధరణ పనుల కోసం ఆగస్టు 1 నుండి 31 వరకు మూసివేయబడుతుందని టీటీడీ వెల్లడించింది. వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు పుష్కరిణి మరమ్మతులు, శుభ్రత పనులు చేపట్టడం ఆనవాయితీ. 
 
మొత్తం నీటిని తొలగించి చేసి, బురద తొలగింపు, మెట్లను శుభ్రపరచడం, పైపులకు పెయింటింగ్‌లు వేయడం, దెబ్బతిన్న పాయింట్లను మరమ్మతు చేయడం వంటి కొన్ని పనులు చేపట్టబడతాయని టీటీడీ వెల్లడించింది. ఈ పనులు పూర్తయ్యే వరకు పుష్కరిణి మూసి ఉంటుందని, భక్తులు సహకరించాలని టీటీడీ పత్రికా ప్రకటనలో పేర్కొంది.