సోమవారం, 30 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2024 (11:09 IST)

శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వివాదం : సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ

laddu
ఎంతో పవిత్రమైనదిగా భక్తులు భావించే తిరుమల శ్రీవారి మహా ప్రసాదం కల్తీ అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో సోమవారం కీలక విచారణ జరుగనుంది. తితిదే పూర్వ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామిలు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ప్రత్యేకంగా విచారణ చేపట్టనుంది. శ్రీవారి లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో పంది నెయ్యి, జంతువుల కొవ్వు కలిపారనే అంశం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసిన విషయం తెల్సిందే. ఇదే అంశంపై ఏపీలో అధికార టీడీపీ, వైకాపా నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. 
 
ఈ నేపథ్యంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారనే ఆరోపణలు. ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురి పిటిషన్లు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అభ్యర్థించారు. ఎన్డీబీబీ ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలంటూ సుబ్రహ్మణ్యస్వామి కోరారు. 
 
తిరస్కరించిన నెయ్యిని ప్రసాదంలో వాడలేదని ఈవో చెప్పిన విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి పిటిషనర్లు తీసుకెళ్లారు. తిరస్కరించిన నెయ్యిని వాడనప్పుడు లడ్డూ అపవిత్రత ఎక్కడిదని వారు ప్రశ్నించారు. ల్యాబ్ రిపోర్టు తయారీ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా లేదా అనేది తేల్చాలని పిటిషన్‌లో వారు విజ్ఞప్తి చేశారు. 
 
ఇలాంటి తప్పుడు ఆరోపణలతో తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని వాదనలు. ఎస్ఓపి ప్రకారం పరీక్షల్లో నెగ్గిన నెయ్యిని తిరుమల ప్రసాదానికి వాడటం దశాబ్దాలుగా కొనసాగుతున్న విధానం. ఓ చిన్న రిపోర్టును ఆధారంగా చేసుకుని కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. అందుకే సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి అని’ పిటిషనర్లు కోరారు.