1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 23 జనవరి 2015 (18:56 IST)

బాబు కరెంట్ ఉత్పత్తి ఆపించిండు.. ఇప్పుడేమో?: కర్నె

నాగార్జునసాగర్ డ్యామ్‌పై ఏపీ సర్గార్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. నాగార్జునసాగర్ డ్యామ్ 13 గేట్లు, కుడి కాల్వ నిర్వహణను తమకు అప్పగించాలని ఏపీ ప్రభుత్వం లేఖ రాయడంపై కర్నె ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
తెలంగాణ పంటలు ఎండబెట్టడానికే గతంలో చంద్రబాబు కరెంట్ ఉత్పత్తి ఆపించిండు అని ధ్వజమెత్తారు. మానవతా దృక్పథంతోనే సీఎం కేసీఆర్ కృష్ణా డెల్టాకు నీళ్లిస్తున్నారని తెలిపారు. ఏపీ సర్కార్ ఇలానే వ్యవహరిస్తే జూరాల నుంచి నీటి చుక్క కూడా కిందకు రానివ్వమని స్పష్టం చేశారు.