సంబంధిత వార్తలు
- ఏప్రిల్ 30వ తేదీ వరకు కల్యాణమస్తు సామూహిక వివాహాల దరఖాస్తుల గడువు పొడిగింపు
- తెలంగాణలో రేషన్కార్డు దరఖాస్తులకు మోక్షం!
- పెండింగ్లో ఉన్న అర్జీల విడుదలకు చర్యలు చేపట్టాలి: విజయవాడ మున్సిపల్ కమిషనర్
- ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు
- వైద్య విద్య ప్రవేశాలకు మార్గం సుగమం: ప్రకటన జారీ చేసిన ఎన్టీఆర్ వర్సిటీ
వాహన మిత్ర లబ్దికి 6 వరకు దరఖాస్తులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 2021-22 సంవత్సరానికి గానూ వైఎస్సార్ వాహన మిత్ర పథకానికి దరఖాస్తు చేసుకోని అర్హులైన సొంత వాహనం కలిగిన ఆటో, టాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్ కమ్ ఓనర్ అన్నదమ్ముల సౌకర్యార్థం 6 జులై, 2021 వరకు దరఖాస్తు చేసుకునే తేదీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసామని రవాణా, సమాచార, పౌర సంబంధాల శాఖ మాత్యులు పేర్ని నాని తెలిపారు.
2021-22 సంవత్సరానికి గానూ 15 జూన్, 2021న 2,48,468 మంది వాహనదారులకు రూ.249 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి అందజేశారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దరఖాస్తు చేసుకునే కాలాన్ని 6 జులై, 2021 వరకు పెంచినట్లు మంత్రి వెల్లడించారు.
వైఎస్సార్ వాహన మిత్ర పథకానికి సంబంధించి ఇంకా ఎవరైనా అర్హులైన ఆటో, టాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్ అన్నదమ్ములు మిగిలిపోయి ఉంటే 6 జులై, 2021 వరకు తమ తమ పరిధిలోని గ్రామ /వార్డు సచివాలయాల్లో అవసరమైన అన్ని పత్రాలు సమర్పించి, దరఖాస్తు చేసుకొని వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.
తర్వాతి కథనం
